DNB News - ఆంధ్రప్రదేశ్ / : 77వ గణతంత్ర దినోత్సవం :: ఆసరా స్వచ్చంద సేవా సంస్థ రొంపిచర్ల మండలం RTC బస్టాండ్ ఆవరణలో ఉన్న భారత రత్న Dr. BR. అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26 ను పురస్కరించుకొని జండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా విద్యావేత్త Dr. T. రఘునాథ్ మాట్లాడుతూ దేశానికి సంపూర్ణ స్వాతంత్రమ్ సిద్దించిన రోజు అని దానికి రాజ్యాంగం అనే పరిపాలన గ్రంధం మూల ఆధారం. ఈ గ్రంథ రచన కు మొదటి రాష్ట్ర పతి Dr.బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులు గా ము సాయిదా కమిటీ కొంతమంది సభ్యులు గా ఏర్పాటు చేసి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా అంబేద్కర్ గారు చేసిన కృషి నాటి ప్రధాని నెహ్రూ యొక్క ప్రోత్సాహం తో రాజ్యాంగ రచన పూర్తి అయి తద్వారా మన దేశాన్ని మనమే పరిపాలన విధానం, ప్రజాస్వామ్యం పద్ధతిలో ప్రజలు ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవడం, దేశంలో ఉన్న ప్రతి పౌరుడు స్వేచ్చ, సమానత్వం, సౌభ్రతృత్వం కలిగి, లౌకిక స్వభావం తో ముందుకు సాగేలా, ప్రతి మనిషి కి తనకున్న హక్కులు, విధులు ఉపయోగించి జీవించాలని, చట్ట సభలు, గ్రామీణ స్థాయి నుంచి అన్ని విభాగల్లో పరిపాలన ఎలా చేయాలో రాజ్యాంగం చెబుతుంది. కాబట్టి రాజ్యాంగం ప్రకారం మన దేశంలో బాధ్యత గా నడుచుకోవాలని, అప్పుడే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని, జాతీయత భావం తో భారతీయులు గా ముందుకు సాగుదాం అన్నారు. ఈ కార్యక్రమంలో అస్సరా సంస్థ అధ్యక్షులు వల్లిపాగు ధనంజయ, సభ్యులు N. ఓబులేసు, దూదేకుల సంఘం &మీడియా నాయకులు G.నూరేషా, శ్రీనివాస ఫోటో స్టూడియో అధినేత & రొంపిచర్ల మండలం మీడియా కో- ఆర్డినేటర్ మల్లేపల్లి వెంకటేష్ స్థానికులు పాల్గొన్నారు.
Admin
DNB News