DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయంటూ, వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (DSF) డిమాండ్ చేసింది. ఈ మేరకు DSF కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ, అకాడమిక్ సంవత్సరం ప్రారంభానికి ముందే అడ్మిషన్లు నిర్వహించడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేస్తూ ముందస్తు అడ్మిషన్లు చేపడుతున్న ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాంటి పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి, ఈ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముందస్తు అడ్మిషన్లు ఎందుకు నిర్వహిస్తున్నారో స్పష్టం చేయాలని DSF ప్రశ్నించింది. సమస్యపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్న పాఠశాలల ముందు నిరసనలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో DSF నాయకులు మహేష్, అరవింద్, విక్రమ్, హనుమేష్, రమణ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News