DNB News - ఆంధ్రప్రదేశ్ / : భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) స్థానిక బుడెక్కల్ కార్యాలయంలో 29-04-2026 న మధ్యాహ్నం 12 గంటలకు కీర్తిశేషులు కామ్రేడ్ గోరుకల్లు అయ్యప్ప గౌడ్ 5వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆదోని నియోజకవర్గ అధ్యక్షుడు బసాపురం గోపాల్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా CPI జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. సుదర్శన్, CPI పట్టణ కార్యదర్శి టి. వీరేష్, CPI మండల టూ కార్యదర్శి బిజి ఎల్లప్ప, AIYF పట్టణ కార్యదర్శి గోరుకల్లు అంజిత్ గౌడ్ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ కామ్రేడ్ అయ్యప్ప గౌడ్ పేదల కోసం, భూమిలేని నిరుపేదల కోసం జీవితాంతం పోరాడిన మహానేత అని కొనియాడారు. దొడ్డనకేరి గ్రామంలో తన సొంత భూములను కూడా నిరుపేదలకు పంచిన త్యాగమూర్తి అని గుర్తుచేశారు. అలాగే CPI తరపున ఎంపీటీసీగా గెలుపొందడం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా బాధ్యుడిగా, CPI పట్టణ కార్యదర్శిగా, జిల్లా కార్యవర్గ సభ్యునిగా సేవలందించడం వంటి అంశాలను ప్రస్తావించారు. ఆయన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను సాధించే దిశగా పనిచేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోరుకల్లు కృష్ణమూర్తి, DHPS కార్యదర్శి విజయ్, పుష్పరాజు, రాము, దొడ్డనకేరి ఉరుకుందు, మండిగిరి శేషప్ప, అస్లాం భాష, ఉదయ్ కిరణ్ యాదవ్, శశి తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News