DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని మండల పరిధిలోని మదిరే గ్రామం ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని 10వ తరగతి విద్యార్థినీ–విద్యార్థులకు వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మధిరే భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్వయంగా వాటర్ బాటిళ్లను అందజేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు నీటి అవసరం ఎక్కువగా ఉంటుందని భావించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని భాస్కర్ రెడ్డి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వాటర్ బాటిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని మదిరే బెస్తా శ్రీనివాసులు ఏర్పాటు చేయడం ఆశించదగ్గ విషయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారాయణ, ప్రధానోపాధ్యాయులు రంగనాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News