DNB News - ఆంధ్రప్రదేశ్ / : మునగాల:పిడిత ప్రజల ప్రియతమ నేత తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన మహోన్నత నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం పార్టీ మండలకార్యదర్శి బుర్రి శ్రీరాములు అన్నారు. మంగళవారం మునగాల మండల కేంద్రంలో సీపీఎం పార్టీ కార్యాలయం సుందరయ్య భవనంలోని సిపిఎం పార్టీ మండలకమిటీఆధ్వర్యంలో సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటి కి భూస్వామ్య పెత్తందారి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహానాయకుడని,తెలంగాణ సాయుధ రైకంగ పోరాట రథసారథి. మచ్చలేని మహా నాయకుడు సుందర రామ్ రెడ్డి అయిన తన పేరు ను సుందరయ్యగా మార్చుకుని అందరికీ ఆదర్శ ప్రాయుడుగా నిలిచిన మహానేత. ఆయన ప్రజా జీవితం కార్మిక వ్యవసాయ కార్మిక సంఘంతో మొద లై రైతాంగ పోరాటంతో పెన వేసుకున్నది. ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శంగా నిలిచిందన్నారు, ఈకార్యక్రమంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, చందా చంద్రయ్య,సిపిఎం పార్టీజిల్లా కమిటీసభ్యులు షేక్ సైదా, బచ్చలకూర స్వరాజ్యం,మండల కమిటీసభ్యులు దేశీరెడ్డి స్టాలిన్ రెడ్డి,మండవ వెంకటాద్రి, బోళ్ల కృష్ణారెడ్డి, నందిగామ సైదులు, సరికొండ నాగరాజు, గడ్డం వినోద్, నెమ్మాది మనోజ్, తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News