DNB News - ఆంధ్రప్రదేశ్ / : మైనారిటీల సమస్యలపై నిజాయితీగా మాట్లాడితే కొందరికి అసౌకర్యం కలగడం సహజమేనని, అయితే ప్రజాప్రతినిధులు మరియు బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు మరింత సమర్థంగా, బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష అన్నారు. బీమస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇన్చార్జి మూటవల్లి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈ సూచనలు చేశారు. మైనారిటీల పేరుతో నిర్వహించే ప్రెస్ మీట్లు స్పష్టతతో, అసలు సమస్యలపై కేంద్రీకృతంగా ఉండాలని సూచించారు. వ్యక్తిగత విమర్శలు, అనవసర వ్యాఖ్యల కంటే సమాజానికి ఉపయోగపడే విధంగా వ్యవస్థపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. జామియా మసీద్ వంటి సంస్థలు ఒక వ్యక్తి లేదా వర్గానికి చెందినవి కావని, వేలాది ముస్లిం మైనారిటీల విశ్వాసాన్ని ప్రతిబింబించే సామూహిక వ్యవస్థలని ఆయన స్పష్టం చేశారు. అలాంటి సంస్థలపై మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త అవసరమని చెప్పారు. ఇటీవల వ్యాఖ్యల్లో వ్యక్తిగత అంశాలను ప్రస్తావించడం సరైన పద్ధతి కాదని, ముఖ్యంగా కుటుంబ సభ్యులు లేదా వ్యక్తిగత జీవితంపై మాట్లాడటం తగదని మగ్ధుం భాష అభిప్రాయపడ్డారు. సమాజ అభివృద్ధి, విద్య, అవకాశాలు వంటి ముఖ్య అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే, మైనారిటీలలో ఉన్న చదువుకున్న మేధావులు, నాయకులు కలిసి వ్యవస్థను బలోపేతం చేయాలని, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడం అవసరమని అన్నారు. మీడియా వేదికలను ఉపయోగించేటప్పుడు మరింత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.
Admin
DNB News