DNB News - ఆంధ్రప్రదేశ్ / : నంద్యాల చెక్పోస్ట్ సమీపంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, పాణ్యం ఎమ్మెల్యే చరిత కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో ప్రజలకు స్వయంగా భోజనం వడ్డించి సేవల ప్రారంభాన్ని ప్రకటించారు. పేద మరియు అవసరమైన ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తున్నదని వారు తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Admin
DNB News