DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లాలో జిడిడిపి (GDDP) మరియు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ (KPI) అంశాల పురోగతిపై జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి సూచికలను మెరుగుపర్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సమయానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖకు సంబంధించిన పనుల పురోగతిని వివరంగా సమీక్షిస్తూ, పనుల అమలులో ఎక్కడైనా ఆలస్యం జరిగితే వెంటనే పరిష్కరించాల్సిందిగా సూచించారు. ప్రజలకు అందే సేవలను మరింత మెరుగుపర్చే దిశగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Admin
DNB News