Saturday, 18 April 2026 05:59:02 PM
# మంగ్లీపై ఆరోపణల్ని ఖండిస్తున్నాం..అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు భూక్యా హరినాయక్ # విజయవాడలో బిజెపి కీలక సమావేశం – రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం.. # పోచమ్మ చెరువులో పూడికతీత పనులకు భూమి పూజ – స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై కలెక్టర్ డా.ఏ.సిరి అవగాహన # స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పోలీసుల స్వచ్ఛత కార్యక్రమాలు... # శాతవాహనలో ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు # విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కరీంనగర్ # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలంపియాడ్ లో పతకాలు # రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు

ఆదోనిలో కల్తీ పాలపై ఉక్కుపాదం – పలు డైరీలపై మెరుపు దాడులు..

Date : 03 March 2026 12:50 PM Views : 51

DNB News - ఆంధ్రప్రదేశ్ / : జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కల్తీ ఆహార పదార్థాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఆదోని పట్టణంలోని పలు పాల డైరీలపై జిల్లా ఆహార భద్రత అధికారి (DFSO) రాజగోపాల్ రావు నేతృత్వంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఇటీవల రాజమండ్రిలో కల్తీ పాలు సేవించి ఐదుగురు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలకు ఆదేశాలు జారీ చేసింది. దాడుల సందర్భంగా పాత పోస్ట్ ఆఫీస్ సమీపంలోని నాగరాజ్ మిల్క్ పార్లర్, గణేష్ సర్కిల్ వద్ద ఉన్న తిరుమల డైరీ, కౌడల్పేటలోని పల్లె పాలు విక్రయ కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. ప్రతి డైరీ నుండి పాల శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఆహార భద్రత అధికారి రాజగోపాల్ రావు స్పష్టం చేశారు. ప్రజలు నాణ్యమైన ఆహార పదార్థాలను మాత్రమే వినియోగించాలని, అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :