Wednesday, 17 June 2026 03:02:10 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఎమ్మెల్యే పార్థసారథిపై బి. దేవా ఫైర్..

Date : 15 May 2026 11:47 AM Views : 54

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా తప్పుడు, ఆధారరహితమైనవని వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు బి. దేవా తీవ్రంగా విమర్శించారు. గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. జగనన్న కాలనీ భూసేకరణలో రూ.128 కోట్ల అవినీతి జరిగిందని ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని ఆయన అన్నారు. గత సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో 178 ఎకరాల భూమిని రైతుల నుంచి ఎకరాకు రూ.13.50 లక్షల చొప్పున మొత్తం రూ.24.30 కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేసిందని వివరించారు. రూ.24 కోట్ల కొనుగోలులో రూ.128 కోట్ల కుంభకోణం ఎలా జరిగిందో ఎమ్మెల్యే ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఈ వివరాలను ఎవరైనా ఆర్‌టీఐ ద్వారా పొందవచ్చని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి రైతుల వద్ద అక్రమ అగ్రిమెంట్లు చేసుకున్నారని ఆరోపిస్తున్న ఎమ్మెల్యే, ఒక్క రైతునైనా మీడియా ముందుకు తీసుకురాగలరా అని ప్రశ్నించారు. సొంత కూటమి నేతలే ఎమ్మెల్యేపై రూ.50 లక్షలు డిమాండ్ చేశారని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో, వాటిని మర్చిపోయేలా చేయడానికే ఎమ్మెల్యే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే అనుచరులు ఎస్కేడీ కాలనీలో దొంగ రిజిస్ట్రేషన్లు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, వాటిపై ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని బి. దేవా ప్రశ్నించారు. “దొంగే దొంగ అన్నట్లు ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారు” అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల తరువాత ఇంతకాలం గడిచినా ఆదోని అభివృద్ధికి ఎమ్మెల్యే ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నా, దొంగతనాలు, దోపిడీలు పెరుగుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆదోనిని అభివృద్ధి చేసే సామర్థ్యం లేకపోతే ఎమ్మెల్యే వెంటనే రాజీనామా చేసి మళ్లీ ప్రజల్లోకి రావాలని బి. దేవా సవాల్ విసిరారు. ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ఇకనైనా విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: