DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన జి.సాయి ప్రసాద్ IAS ని గౌరవ పూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ అధినేత ' పద్మశ్రీ ' మందకృష్ణ మాదిగ ... ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి జి . సాయి ప్రసాద్ నేడు అమరావతిలోని సచివాలయంలో ఎమ్మార్పీఎస్ అధినేత 'పద్మశ్రీ' మందకృష్ణ మాదిగ గౌరవపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ సామాజిక సమస్యల మీద చీఫ్ సెక్రటరీ తో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య (ఎంఈఎఫ్) జాతీయ అధ్యక్షులు ప్రొఫెసర్ చిలుమూరు శ్రీనివాస్ గారు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెళ్లి ఎలీషా మాదిగ ఎంఎస్పీ జాతీయ నేత మంద వెంకటేశ్వరరావు మాదిగ తదితరులు ఉన్నారు.
Admin
DNB News