Saturday, 13 June 2026 07:09:10 AM
# రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి.. # ISPL టోర్నమెంట్‌లో సందడి చేసిన ఎమ్మెల్యే పార్థసారథి.. క్రీడాకారులకు ప్రోత్సాహం.. # కేంద్ర సబ్సిడీ రుణ పథకాలతో స్వయం ఉపాధి అవకాశాలు పెంచుకోండి: ఎమ్మెల్యే డా. పార్థసారథి.. # ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేత # రేషన్ షాపుల్లో పూర్తి స్థాయిలో సరుకుల పంపిణీ చేయాలి: డీవైఎఫ్‌ఐ.. # కలకోవ గ్రామంలో నూతన భవన నిర్మాణ కార్మిక సంఘం ఏకగ్రీవ ఎన్నిక # చెరువుల ఆక్రములపై చర్యలు తీసుకోవాలి. మత్స్య సహకార సంఘం డిమాండ్ # ఆదోని రెండో మండలానికి ప్రత్యేక అధికారులను నియమించాలి: MHPS నూర్ అహ్మద్... # బాధిత కుటుంబలను పరామర్శించిన - మాజీ స్పీకర్ తమ్మినేని # జలధార జలహారతితో చెరువులకు పునర్జీవం – శ్రామికులకు కలెక్టర్ డా. ఏ.సిరి అవగాహన...

ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు..

Date : 09 June 2026 10:13 AM Views : 14

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఆదివారం కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించిన ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా , ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైక్లింగ్, వ్యాయామాన్ని రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. సైక్లింగ్ ద్వారా శారీరక దృఢత్వం పెరగడంతో పాటు వాహనాల వల్ల కలిగే కాలుష్యం తగ్గి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. ఈ సైకిల్ ర్యాలీ కొండారెడ్డి బురుజు వద్ద ప్రారంభమై ఓల్డ్ కంట్రోల్ రూమ్, కిడ్స్ వరల్డ్, రాజ్ విహార్ మీదుగా సాగి తిరిగి జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో సీఐలు గుణశేఖర్ బాబు, పార్థసారథి, ఆర్‌ఐలు నారాయణ, పోతల రాజు, ఆర్‌ఎస్‌ఐలు, ఏఆర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత కల్పించడం లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :