DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఆదివారం కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద నిర్వహించిన ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమాన్ని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా , ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీలు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైక్లింగ్, వ్యాయామాన్ని రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. సైక్లింగ్ ద్వారా శారీరక దృఢత్వం పెరగడంతో పాటు వాహనాల వల్ల కలిగే కాలుష్యం తగ్గి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. ఈ సైకిల్ ర్యాలీ కొండారెడ్డి బురుజు వద్ద ప్రారంభమై ఓల్డ్ కంట్రోల్ రూమ్, కిడ్స్ వరల్డ్, రాజ్ విహార్ మీదుగా సాగి తిరిగి జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో సీఐలు గుణశేఖర్ బాబు, పార్థసారథి, ఆర్ఐలు నారాయణ, పోతల రాజు, ఆర్ఎస్ఐలు, ఏఆర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత కల్పించడం లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.
Admin
DNB News