DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పరామర్శించారు. స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని వారికి అందుతున్న వైద్యసేవలపై విచారించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. ఏ. సిరి వైద్యులతో మాట్లాడి, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యసేవలు అందించాలన్నారు. బాధితులకు ధైర్యం చెప్పిన కలెక్టర్, ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు
Admin
DNB News