DNB News - ఆంధ్రప్రదేశ్ / : డాక్టర్ బాబాసాహెబ్ బి ఆర్ అంబేడ్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మంగళవారం పొందూరు మండలం,బురిడికంచరాం, ఏచ్చెర్ల మండల కేంద్రంలో జై బీమ్ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పాలాభిషేకంచేసి , పూలమాలలు వేసి ఘననివాళులు అర్పించిన జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, AITKSS జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ ఈ నేపథ్యంలో పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ ఎన్నో అవమానాలను సహించి , దేశ చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న భారత రాజ్యాంగ రూపకర్త, అణగారిన వర్గాల ఆత్మబంధువు బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారికి స్మృత్యంజలి అన్నారు , విద్య లేకపోతే స్వేచ్ఛ సాధ్యం కాదు… స్వేచ్ఛ లేకపోతే సమానత్వం అసాధ్యం. ఒక దేశ భవిష్యత్తు, అక్కడి యువత విద్యాపై ఆధారపడి ఉంటుంది అని స్పష్టంగా తెలియజేసిన మహనీయుడు Dr. B. R. Ambedkar గారు. ఆయన జీవన యాత్ర, ఆశయాలు, సమాజానికి చూపిన మార్గం మనందరికీ శాశ్వత ప్రేరణ. ఆయన జయంతి సందర్భంగా, విద్య, సమానత్వం, న్యాయం అనే విలువలను మన జీవితాల్లో ఆచరిద్దాం. ఆయన చూపిన దారిలో నడుస్తూ సమ సమాజ నిర్మాణానికి మన వంతు పాత్ర పోషిద్దాం అన్నారు, ఈ కార్యక్రమంలో పొందూరు PACS చైర్మన్ వండాన మురళి, MPTC బొత్స రమణ,BJP మండలం అధ్యక్షులు గొర్లె వెంకటరావు, ముఖ్య నాయకులు పిన్నింటి అప్పలనాయుడు, వండాన కిరణ్, వండాన సాయిరాం, పిసిని గోవిందరావు, ఇప్పిలి సూరయ్య, వాళ్ళ రమణ, పిసిని వెంకటనారాయణ మురళీ, ఈసర్ల గణేష్,బురిడికంచరాం, ఏచ్చెర్ల అంబేద్కర్ యువజన సంక్షేమ సంఘాల నేతలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ,
Admin
DNB News