DNB News - ఆంధ్రప్రదేశ్ / : వేసవి సెలవుల నేపథ్యంలో ట్రావెల్స్ ఏజెన్సీల పేర్లతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ హెచ్చరించారు. ఇటీవల కొందరు సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా, వాట్సాప్ వంటి వేదికల ద్వారా ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీలను ప్రచారం చేస్తూ, తక్కువ ధరల్లో దేశీయ మరియు విదేశీ పర్యటనలు అందిస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నట్లు తెలిపారు. మోసం చేసే విధానం: సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా ప్రకటనలు ఇవ్వడం ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు తక్కువ ఖర్చుతో ప్యాకేజీలు అంటూ నమ్మించడం అడ్వాన్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి, తరువాత సంప్రదింపులు నిలిపివేయడం నకిలీ వెబ్సైట్లు, ఫేక్ రివ్యూల ద్వారా మోసం చేయడం ప్రజలకు సూచనలు: ఏ ట్రావెల్స్ ఏజెన్సీ అయినా ముందుగా ధృవీకరించాలి అధికారిక వెబ్సైట్, రిజిస్ట్రేషన్ వివరాలు పరిశీలించాలి అనుమానాస్పదంగా తక్కువ ధరల ప్యాకేజీలను నమ్మవద్దు ముందస్తు చెల్లింపులు చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి రశీదు లేకుండా డబ్బులు చెల్లించవద్దు సైబర్ నేరాలపై అప్రమత్తత: సైబర్ మోసాలకు గురైన వెంటనే ఒక గంటలోపు స్పందించడం అత్యంత కీలకం. 1930 సైబర్ హెల్ప్లైన్కు కాల్ చేయండి www.cybercrime.gov.in� లో ఫిర్యాదు నమోదు చేయండి సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి లేదా Dial 112 / 100 కు సమాచారం ఇవ్వండి ప్రజల అప్రమత్తతే సైబర్ మోసాల నివారణకు ప్రధాన ఆయుధమని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.
Admin
DNB News