Wednesday, 17 June 2026 02:22:08 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

టూర్ ప్యాకేజీల పేరుతో సైబర్ మోసాలు – అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరిక...

Date : 30 April 2026 11:43 AM Views : 59

DNB News - ఆంధ్రప్రదేశ్ / : వేసవి సెలవుల నేపథ్యంలో ట్రావెల్స్ ఏజెన్సీల పేర్లతో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ హెచ్చరించారు. ఇటీవల కొందరు సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా, వాట్సాప్ వంటి వేదికల ద్వారా ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీలను ప్రచారం చేస్తూ, తక్కువ ధరల్లో దేశీయ మరియు విదేశీ పర్యటనలు అందిస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నట్లు తెలిపారు. మోసం చేసే విధానం: సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా ప్రకటనలు ఇవ్వడం ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు తక్కువ ఖర్చుతో ప్యాకేజీలు అంటూ నమ్మించడం అడ్వాన్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి, తరువాత సంప్రదింపులు నిలిపివేయడం నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ రివ్యూల ద్వారా మోసం చేయడం ప్రజలకు సూచనలు: ఏ ట్రావెల్స్ ఏజెన్సీ అయినా ముందుగా ధృవీకరించాలి అధికారిక వెబ్‌సైట్, రిజిస్ట్రేషన్ వివరాలు పరిశీలించాలి అనుమానాస్పదంగా తక్కువ ధరల ప్యాకేజీలను నమ్మవద్దు ముందస్తు చెల్లింపులు చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి రశీదు లేకుండా డబ్బులు చెల్లించవద్దు సైబర్ నేరాలపై అప్రమత్తత: సైబర్ మోసాలకు గురైన వెంటనే ఒక గంటలోపు స్పందించడం అత్యంత కీలకం. 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి www.cybercrime.gov.in⁠� లో ఫిర్యాదు నమోదు చేయండి సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి లేదా Dial 112 / 100 కు సమాచారం ఇవ్వండి ప్రజల అప్రమత్తతే సైబర్ మోసాల నివారణకు ప్రధాన ఆయుధమని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :