DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆముదాలవలస నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ మాటల్లో కాకుండా అభివృద్ధిని చేతల్లో చూపిస్తున్న కూన రవికుమార్ ని అభినందిస్తున్న నియోజకవర్గ ప్రజలు జగ్గుశాస్త్రులు పేటలో రూ .3.86 కోట్లతో 33/11 కేవీ కొత్త ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ మంజూరు ఎమ్మెల్యే కూన రవికుమార్ విశేష కృషికి ఫలితం ఆముదాలవలస నియోజకవర్గంలోని ఆమదాలవలస మున్సిపాలిటీలో జగ్గుశాస్త్రులు పేట గ్రామంలో 33/11 కేవీ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 కోట్ల 86 లక్షలు మంజూరు చేసింది. ఈ సబ్ స్టేషన్ నిర్మాణంతో పరిసర గ్రామాల ప్రజలకు నిరంతరాయంగా, ఆటంకం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుంది.ఈ కీలకమైన సబ్ స్టేషన్ మంజూరుకు ఆముదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ నిరంతరం చేసిన కృషే కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. గత కొంతకాలంగా విద్యుత్ లోపాల కారణంగా రైతులు, పరిశ్రమలు, గృహ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ సబ్ స్టేషన్ శాశ్వత పరిష్కారంగా నిలవనుంది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ,“ఈ ప్రాంతంలో విస్తారంగా డ్రై ల్యాండ్స్ ఉండటం వల్ల పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అనుకూల వాతావరణం ఉంది. తక్కువ పెట్టుబడితోనే పరిశ్రమలకు అవసరమైన నాణ్యమైన విద్యుత్ లభించనుంది. దీని ద్వారా పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతుంది. ముఖ్యంగా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి” అని తెలిపారు.సబ్ స్టేషన్ నిర్మాణంతో వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, వాణిజ్య రంగం మరింత బలోపేతం కావడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించనుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కారణమైన ఎమ్మెల్యే కూన రవికుమార్ కృషిని జగ్గుశాస్త్రులు పేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలు హర్షాతిరేకాలతో అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
Admin
DNB News