Saturday, 18 April 2026 02:06:56 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

గణతంత్ర దినోత్సవం సందర్భంగా లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు – కర్నూలు పోలీసులు అప్రమత్తం..

Date : 26 January 2026 10:21 AM Views : 57

DNB News - ఆంధ్రప్రదేశ్ / : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల భద్రతకు కర్నూలు జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా పలు లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు సబ్‌డివిజన్ల పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్‌లకు చెందిన లాడ్జీల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. లాడ్జీల్లో బస చేస్తున్న వ్యక్తులు ఎంతకాలంగా ఉన్నారు అనే వివరాలు తెలుసుకొని, వారి ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాలు, లాడ్జీ రిజిస్టర్లు పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెంచి, ప్రజల భద్రతకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. లాడ్జీ యజమానులు పోలీసు శాఖ సూచించిన భద్రతా ప్రమాణాలు, మార్గదర్శకాలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. ముఖ్యంగా సీసీ కెమెరాల ఏర్పాటు, పనితీరును తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సంబంధిత సీఐలు, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొని పర్యవేక్షణ నిర్వహించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :