DNB News - ఆంధ్రప్రదేశ్ / : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజల భద్రతకు కర్నూలు జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఆదివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా పలు లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు సబ్డివిజన్ల పరిధిలోని ఆయా పోలీస్ స్టేషన్లకు చెందిన లాడ్జీల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. లాడ్జీల్లో బస చేస్తున్న వ్యక్తులు ఎంతకాలంగా ఉన్నారు అనే వివరాలు తెలుసుకొని, వారి ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాలు, లాడ్జీ రిజిస్టర్లు పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెంచి, ప్రజల భద్రతకు భంగం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. లాడ్జీ యజమానులు పోలీసు శాఖ సూచించిన భద్రతా ప్రమాణాలు, మార్గదర్శకాలు పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. ముఖ్యంగా సీసీ కెమెరాల ఏర్పాటు, పనితీరును తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సంబంధిత సీఐలు, ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొని పర్యవేక్షణ నిర్వహించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
Admin
DNB News