DNB News - ఆంధ్రప్రదేశ్ / : హన్మంతు జ్యోతి దొర కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు..! 1943లో శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన దొర పోలీసు విభాగంలో సుమారు నాలుగు దశాబ్దాలపాటు విశేష సేవలందించారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఆయన పోలీసు శాఖలో సంస్కరణలు తీసుకురావడానికి కృషి చేశారు.. మొదట అడిషనల్ డీజీపీగా అనంతరం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు చేపట్టి రాష్ట్ర శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేశారు..! 1965 బ్యాచ్ కు చెందిన దొర 1996 లో డీజీపీ గా పదోన్నతి పొందారు.. మాజీ సీఎం ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టపడే దొర.. ఎన్టీఆర్ తో నేను.. అనే పుస్తకాన్ని కూడా రచించారు..! పీపుల్స్ వార్ పేరుతో నాడు ఉమ్మడి రాష్ట్రంలో బలంగా విస్తరించిన మావోయిస్టు పార్టీని ఎదుర్కోవడంలో దొర తనదైన శైలిలో వ్యవహరించారు. తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు...!
Admin
DNB News