Monday, 15 June 2026 01:43:27 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

పురాతన కోతుల బావి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ భూమి పరిరక్షణకు విశ్వ హిందూ పరిషత్ – బజరంగ్ దళ్ ఆందోళన..

Date : 18 February 2026 04:52 PM Views : 99

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మిగనూరు పట్టణంలోని పురాతన “కోతుల బావి” శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి చెందిన భూమి పరిరక్షణ, అభివృద్ధి అంశంపై విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. దేవాలయానికి చెందిన 33 సెంట్ల స్థలంలో భక్తులు ప్రతిష్ఠించిన శ్రీ గణేష్ మరియు హనుమంతుని విగ్రహాలను రెండు రోజుల క్రితం ఎమ్మిగనూరు మున్సిపల్ సిబ్బంది, పోలీసుల సహకారంతో, స్థానిక రాజకీయ నాయకుల అండతో ప్రజలు చూస్తుండగానే కూల్చివేసిన ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ చర్య హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొన్నారు. గత కొంతకాలంగా దేవాలయ భూమిని కబ్జా చేసి అక్రమంగా షాపులు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తూ, దేవాలయ పవిత్రతను భంగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేవాలయానికి చెందిన 33 సెంట్ల భూమి పూర్తిగా దేవాలయానికే చెందేలా చర్యలు తీసుకోవాలని, దేవాలయం ముందు ఉన్న స్థలాన్ని రహదారి అవసరాలకే వినియోగించాలన్నారు. రాష్ట్ర కమిటీ సూచన మేరకు రాష్ట్ర మరియు జిల్లా ప్రతినిధి బృందం ఎమ్మిగనూరుకు చేరుకుని మున్సిపల్ కార్యాలయం, డి.ఎస్.పి కార్యాలయం ముందు రామనామస్మరణతో నిరసన కార్యక్రమాలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం పురాతన కోతుల బావి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు. దేవాలయ భూమిపై అక్రమాలు చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, గతంలో అన్య మతస్తులకు షాపులు కేటాయించి డబ్బులు వసూలు చేసిన రాజకీయ నాయకులపై కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్న పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే న్యాయపరమైన పోరాటం కొనసాగిస్తామని, దేవాలయ గౌరవం కాపాడే వరకు ఉద్యమం ఆగదని విశ్వ హిందూ పరిషత్ – బజరంగ్ దళ్ నాయకులు స్పష్టం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :