DNB News - ఆంధ్రప్రదేశ్ / : ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు..రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ మరియు కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నిరసన కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. మేడిపల్లి సత్యం, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఆకుల నరసయ్యతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డా.మేడిపల్లి సత్యం, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వైద్యుల అంజన్ కుమార్, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఎడ్ల బండ్ల పై ఎక్కి నిరసన తెలపగా, పార్టీ శ్రేణులు రిక్షా పై ద్విచక్ర వాహనాలను ఎక్కించి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించినారు. అనంతరం జిల్లా కలెక్టర్ కి రాసిన వినతి పత్రమును ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సిసిసి అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆకుల నరసయ్య తదితరులు అదనపు కలెక్టర్ కి అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డా. మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ సామాన్యుల నడ్డి విరిచేలా పనిచేస్తోంది. ఇటీవల జరిగిన బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు శాసనసభ ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు పెరుగుతాయని తస్మాత్ జాగ్రత్త అని మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ముందే హెచ్చరించారు.
Admin
DNB News