DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఈరోజు మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా మాజీ శాసనసభ్యులు, ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రజాసేవ లక్ష్యంగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నారా లోకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదోని టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, ఎమ్మెల్సీ బిటి నాయుడు, ఏపీ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి, యువ నాయకులు భూపాల్ చౌదరి, మారుతి నాయుడు తదితర ప్రముఖులు హాజరయ్యారు. అలాగే రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ శారదా భాయ్, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రామంజి, కర్నూల్ పార్లమెంట్ ఉపాధ్యక్షులు బసవరాజు, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, మండల అధ్యక్షులు శివప్ప, కౌన్సిలర్లు, పార్టీ ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
DNB News