Monday, 15 June 2026 01:48:57 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఇళ్లులేని పేదల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యం – సిపిఐ ఆందోళన, కలెక్టర్ కార్యాలయం ముట్టడికి హెచ్చరిక..

Date : 25 March 2026 12:31 PM Views : 40

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఇళ్లులేని నిరుపేదల ఆవేదనను పట్టించుకోకుండా ప్రభుత్వం ఖాళీ హామీలతో ప్రజలను మోసం చేస్తోందని సిపిఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య తీవ్రంగా విమర్శించారు. మంగళవారం సిపిఐ ఆధ్వర్యంలో పట్టణ మండలం 2 కార్యదర్శులు టి. వీరేష్, మధిరె ఎల్లప్ప నాయకత్వంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బి. గిడ్డయ్య మాట్లాడుతూ పేదల సమస్యలపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై మండిపడ్డారు. పేదలకు ఇళ్లు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటికీ అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు భూమి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా ఆ హామీలను నెరవేర్చకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఖజానా ఖాళీ అయిందని సాకులు చెప్పడం నిరుపేదలపై చేసిన ద్రోహమని అన్నారు. ఇప్పటికే ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే సిపిఐ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని, అవసరమైతే సబ్ కలెక్టర్ కార్యాలయం మాత్రమే కాదు, కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి కే. రమేష్ కుమార్, లక్ష్మీనారాయణ, సత్యనారాయణ, AIYF పట్టణ కార్యదర్శి అంజిత్ గౌడ్, DHPS నాయకులు విజయ్, ప్రజానాట్యమండలి నాయకులు ఈరన్న, లింగప్ప, ఆటో వర్కర్స్ నాయకులు ఈరన్న, రామకృష్ణ, శంకర్, పుష్పరాజు, అస్లాం రాజు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :