DNB News - ఆంధ్రప్రదేశ్ / : పట్టణంలోని ఐసీడీఎస్ (ICDS) కార్యాలయంలో బుధవారం ఉదయం ‘పోషణ్ పఖ్వాడ’ అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పి.వి. పార్థసారథి వాల్మీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే సూత్రాన్ని ప్రతిఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. అలాగే, గ్రామీణ మరియు పట్టణ స్థాయిలో పోషకాహారంపై అవగాహన పెంచడంలో అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) సత్యవతి, సీడీపీఓ (CDPO) ఢిల్లీశ్వరి, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు మరియు సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారుల పెరుగుదల, ఆరోగ్య సంరక్షణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.
Admin
DNB News