DNB News - ఆంధ్రప్రదేశ్ / : కార్యక్రమంలో భాగంగా కర్నూలు మండలం తొలిసాపురం గ్రామ చెరువులో ఉపాధి హామీ పథకం కింద నిర్వహిస్తున్న పూడికతీత పనులను జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మంగళవారం పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా చెరువుల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాల పెరుగుదల, సాగునీటి వనరుల అభివృద్ధి సాధ్యమవుతుందని కలెక్టర్ తెలిపారు. ఉపాధి హామీ శ్రామికులతో మాట్లాడి వారి సమస్యలు, సూచనలను తెలుసుకున్నారు. అనంతరం శ్రామికులకు ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాలు, బాల్య వివాహాల నిర్మూలన అవసరం, అక్షరాంధ్ర కార్యక్రమం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ప్రతి కుటుంబం విద్యాాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, బాల్య వివాహాలను అరికట్టడంలో సమాజం భాగస్వామ్యం కావాలని సూచించారు. అక్షరాస్యత పెంపొందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న అక్షరాంధ్ర కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, వయోజనులు కూడా చదువు నేర్చుకునే అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు, ఉపాధి హామీ సిబ్బంది మరియు శ్రామికులు పాల్గొన్నారు.
Admin
DNB News