DNB News - ఆంధ్రప్రదేశ్ / : భారత ప్రభుత్వం చేపట్టనున్న జనగణన–2027 తొలి దశలో భాగంగా నిర్వహించనున్న గృహ జాబితా (House Listing) మరియు గృహ జనగణన కార్యక్రమాల సమర్థవంతమైన అమలుకు సంబంధించి జిల్లా మరియు చార్జ్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమం కర్నూలులోని జి. పుల్లయ్య ఇంజినీరింగ్ & టెక్నాలజీ కళాశాలలో కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. జనగణన ప్రక్రియను పారదర్శకంగా, ఖచ్చితంగా నిర్వహించేందుకు ప్రతి అధికారి తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆమె సూచించారు. గృహ జాబితా మరియు గృహ జనగణన కార్యక్రమాలు ప్రభుత్వ పథకాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అనంతరం శిక్షణకు సంబంధించిన కంప్యూటర్ ల్యాబ్ నిర్వహణను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. డేటా నమోదు, సాంకేతిక సదుపాయాల వినియోగం, సిబ్బంది సామర్థ్యంపై ఆమె సమీక్ష నిర్వహించారు. సాంకేతిక లోపాలు లేకుండా శిక్షణ ప్రక్రియ కొనసాగించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. జిల్లా స్థాయిలో జనగణన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
Admin
DNB News