DNB News - ఆంధ్రప్రదేశ్ / : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే ధ్యేయంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా టిడిపి కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ అధ్యక్షతన మండల, నగర, పట్టణ అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శుల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, బూత్ స్థాయి కమిటీల ఏర్పాటు, స్థానిక సమస్యలపై చర్చించి, రాబోయే ఎన్నికలకు వ్యూహరచన చేయాలని నిర్ణయించారు. సమావేశానికి చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్, కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ర, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ పి కప్పట్రాళ్ల బొజ్జమ్మ, రాష్ట్ర నాయకుడు చంద్రశేఖర్రాజ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే అమర్నాథ్ గౌడ్, పి దామోదర్, కేటి వెంకటేష్, కాశిం వలి, మహేష్ కుమార్, తిమ్మప్ప బోయ, తిరుపతయ్య, జి మల్లికార్జున, సి సురేష్ నాయుడు, పల్లెపాడు రామిరెడ్డి, కే శ్రీనివాసులు, కే పురుషోత్తం, కే శివప్ప, ప్రసన్న లక్ష్మి, జి కిష్టయ్య, గురు స్వామి, రాజేష్, నర్సింలు, వెంకటరమణ, రామాంజనేయులు, పట్టాభి, కే రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీ బలోపేతం చేసి, ప్రతి బూత్లో గెలుపు సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Admin
DNB News