Monday, 15 June 2026 02:35:16 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఫిబ్రవరి 7న కలుగొట్ల గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన – పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి : కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి..

Date : 03 February 2026 11:53 AM Views : 95

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఫిబ్రవరి 7వ తేదీన ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి తెలిపారు. సోమవారం కలుగొట్ల గ్రామంలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ జయ నాగేశ్వర రెడ్డి, ఆదోని ఇంచార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి సీఎం పర్యటనకు సంబంధించి హెలిప్యాడ్, ప్రజావేదిక, రైతులతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించేందుకు అనువైన ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఫిబ్రవరి 7వ తేదీన కలుగొట్ల గ్రామంలో నిర్వహించనున్న పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజావేదిక కార్యక్రమం, రైతుల పొలాల పరిశీలన, రైతులతో ప్రత్యక్ష సంభాషణ వంటి ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమాలు ఎటువంటి అవాంతరాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ జయ నాగేశ్వర రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ, ఇంచార్జి సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, డీఎంహెచ్ఓ భాస్కర్, ఆర్ అండ్ బి ఎస్.ఈ. మహేశ్వర్ రెడ్డి, డీపీఓ భాస్కర్, డీఎస్‌ఓ రాజా రఘువీర్, ఏడీ సర్వే మణికన్నన్, జేడీ అగ్రికల్చర్ వరలక్ష్మి, తహసీల్దార్ శ్రీనివాసులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :