Monday, 15 June 2026 02:26:10 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

విద్యా వ్యాపారంపై సమరశీ పోరాటాలకు సిద్ధం కావాలి – ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి. వలరాజు...

Date : 24 April 2026 11:18 AM Views : 61

DNB News - ఆంధ్రప్రదేశ్ / : అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం స్థానిక సి.ఆర్ భవనంలో నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి. వలరాజు, జిల్లా నిర్మాణ బాధ్యులు బి. గిడ్డయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన జి. వలరాజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యను పరిరక్షించే బాధ్యతను విస్మరించి, విద్యా వ్యవస్థను క్రమంగా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ హామీలను కూడా పక్కనబెట్టి ఉన్నత విద్యను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధంగా చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. ఏపీఎస్‌సిహెచ్ఈ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా నిబంధనలకు విరుద్ధంగా సి.హెచ్.ఈ జి.ఓ నెంబర్ 3 తీసుకువచ్చారని ఆయన తెలిపారు. మరోవైపు, ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రైవేట్ కళాశాలలు తప్పుడు ప్రకటనలు చేయవద్దని ఆదేశించినా, అవి ఎక్కడా అమలు కావడం లేదని, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని అన్నారు. నకిలీ కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవంగా విద్యార్థులు, తల్లిదండ్రులను మభ్యపెట్టేందుకు మాత్రమే ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. బైజూస్, ఫిజిక్స్ వాలా వంటి సంస్థలు అనుమతి లేకుండా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తూ విద్యార్థులను దోచుకుంటున్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇంటర్మీడియట్ విద్యలో కార్పొరేట్ కాలేజీలలో ఉన్న ఫెయిల్ శాతాన్ని గోప్యంగా ఉంచుతున్నారని, అక్రమ అడ్మిషన్లు, పుస్తకాల పేరుతో అధిక వసూళ్లు జరుగుతున్నాయని చెప్పారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కార్పొరేట్ విద్యకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడంలో ఆలస్యం జరుగుతోందని, ప్రకటించిన ₹1200 కోట్లు కూడా పూర్తిగా విడుదల కాలేదని, దీని వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా సమరశీ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమన్న, కార్యదర్శి ఎస్. షాబిర్ భాష, ఆఫీస్ బేరర్స్ శరత్ కుమార్, వీరేష్, నగర కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :