Tuesday, 28 April 2026 02:59:52 PM
# దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం # ఆదోని భూ మోసం బహిర్గతం – బాధితులకు న్యాయం కోసం పోరాటం.. గుడిసె కృష్ణమ్మ # కర్నూలు ఎస్పీని కలిసిన నూతన సివిల్ జడ్జి మహమ్మద్ అజామ్ – అభినందనలు తెలిపిన విక్రాంత్ పాటిల్..

విద్యా వ్యాపారంపై సమరశీ పోరాటాలకు సిద్ధం కావాలి – ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి. వలరాజు...

Date : 24 April 2026 11:18 AM Views : 31

DNB News - ఆంధ్రప్రదేశ్ / : అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం స్థానిక సి.ఆర్ భవనంలో నిర్వహించబడింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి. వలరాజు, జిల్లా నిర్మాణ బాధ్యులు బి. గిడ్డయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన జి. వలరాజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ విద్యను పరిరక్షించే బాధ్యతను విస్మరించి, విద్యా వ్యవస్థను క్రమంగా నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ హామీలను కూడా పక్కనబెట్టి ఉన్నత విద్యను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధంగా చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. ఏపీఎస్‌సిహెచ్ఈ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా నిబంధనలకు విరుద్ధంగా సి.హెచ్.ఈ జి.ఓ నెంబర్ 3 తీసుకువచ్చారని ఆయన తెలిపారు. మరోవైపు, ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రైవేట్ కళాశాలలు తప్పుడు ప్రకటనలు చేయవద్దని ఆదేశించినా, అవి ఎక్కడా అమలు కావడం లేదని, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడంలో విఫలమైందని అన్నారు. నకిలీ కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వాస్తవంగా విద్యార్థులు, తల్లిదండ్రులను మభ్యపెట్టేందుకు మాత్రమే ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. బైజూస్, ఫిజిక్స్ వాలా వంటి సంస్థలు అనుమతి లేకుండా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తూ విద్యార్థులను దోచుకుంటున్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇంటర్మీడియట్ విద్యలో కార్పొరేట్ కాలేజీలలో ఉన్న ఫెయిల్ శాతాన్ని గోప్యంగా ఉంచుతున్నారని, అక్రమ అడ్మిషన్లు, పుస్తకాల పేరుతో అధిక వసూళ్లు జరుగుతున్నాయని చెప్పారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కార్పొరేట్ విద్యకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయడంలో ఆలస్యం జరుగుతోందని, ప్రకటించిన ₹1200 కోట్లు కూడా పూర్తిగా విడుదల కాలేదని, దీని వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా సమరశీ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సోమన్న, కార్యదర్శి ఎస్. షాబిర్ భాష, ఆఫీస్ బేరర్స్ శరత్ కుమార్, వీరేష్, నగర కార్యదర్శి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: