DNB News - ఆంధ్రప్రదేశ్ / : శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేసిన మూలపేట పోర్టుపై చంద్రబాబు నాయుడు,కింజరాపు కుటుంబం చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎండగట్టి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోర్టు పనులు పూర్తి అయ్యేవరకు పోరాటం సాగిద్దామని వైఎస్ఆర్సిపి టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జి పేరాడ తిలక్ పిలుపునిచ్చారు. శనివారం టెక్కలి పార్టీ కార్యాలయం ఆవరణలలో ఈనెల 30వ తేదీన జరగనున్న పోర్టు సందర్శించిన, బహిరంగ సభ కార్యక్రమం పై నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు,కార్యకర్తలతో మండల పార్టీ అధ్యక్షులు హనుమంతు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గొని తిలక్ మాట్లాడారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో పోర్టు మంజూరు చేసి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారని అయితే ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం పనులు పూర్తి చేయకుండా తాత్సారం చేస్తుందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు, కింజరాపు అచ్చన్నాయుడు, రామ్మోహన్ నాయుడు లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు అదనపు భూసేకరణ చేయాలని, పెత్తందారులకు భూములు అప్పగించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిని ఈ ప్రాంత ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా కలిసి పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈనెల 30వ తేదీన జరగనున్న పోర్టు సందర్శన, బహిరంగ సభలో ఉత్తరాంధ్ర జిల్లాలలోని వైఎస్ఆర్సిపి నాయకులంతా హాజరవుతారని, గ్రామాల్లోని ప్రజలందరు పోర్టు దగ్గరకు తరలించి కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తిలక్ పిలుపునిచ్చారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకులు చల్ల రవికుమార్ మాట్లాడుతూ టెక్కలి నియోజకవర్గం లో తిలక్ నాయకత్వంలో అందరూ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి పాటుపడాలని, 30 తేదీ జరగనున్న పోర్టు పనులు పరిశీలన కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా, నియోజకవర్గ,మండల పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, ఎంపీపీలు, జడ్పిటిసి సభ్యులు,మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Admin
DNB News