Saturday, 18 April 2026 02:09:49 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

అమరావతిలో పియుసి కమిటీ చైర్మన్ కూన రవికుమార్ అధ్యక్షతన సమీక్షా సమావేశం

Date : 28 February 2026 11:10 AM Views : 58

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఈరోజు వెలగపూడి లెజిస్లేచర్ సచివాలయంలోని కమిటీ హాల్ నెం.1లో పియుసి కమిటీ సమీక్ష సమావేశం జరిగింది కమిటీ చైర్మన్ కూన రవికుమార్ మరియు సభ్యుల సమక్షంలో గత ఐదేళ్ల వార్షిక నివేదికలు, ఆర్థిక లావాదేవీలు, పరిపాలనా నిర్ణయాలు మరియు సంస్థల సాధారణ కార్యకలాపాలపై విశ్లేషణాత్మక చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా Dr. B. R. Ambedkar University, Srikakulam మరియు Girijan Cooperative Corporation పనితీరును కమిటీ సమగ్రంగా పరిశీలించింది. విద్యా రంగ అభివృద్ధి, గిరిజన సంక్షేమ కార్యక్రమాల అమలు, ఆర్థిక నిర్వహణ, ప్రభుత్వ నిధుల వినియోగం వంటి అంశాలపై సభ్యులు అధికారులను ప్రశ్నించారు. సమావేశానికి సంబంధిత శాఖలైన ఉన్నత విద్యాశాఖ,గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శులు, ఉన్నతాధికారులు అవసరమైన రికార్డులు, వివరాలతో హాజరు హాజరయ్యారు.అలాగే ఆడిట్ విభాగానికి చెందిన అధికారులు కూడా సమావేశంలో పాల్గొని నివేదికలపై వివరణ ఇచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థల పారదర్శకత, సమర్థవంతమైన నిర్వహణ, ప్రజా నిధుల వినియోగంపై బాధ్యతాయుత ధోరణి పాటించే దిశగా కమిటీ సమీక్షలు కీలకంగా నిలుస్తాయని కమిటీ పేర్కొంది ఈ సమావేశంలో తీసుకునే సూచనలు, సిఫార్సులు సంబంధిత శాఖల భవిష్యత్ కార్యాచరణకు మార్గదర్శకంగా ఉంటాయని కమిటీ తెలిపింది. రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఏర్పడిన పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల పనితీరును పర్యవేక్షిస్తుందని చైర్మన్ కూన రవికుమార్ తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :