DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆముదాలవలస నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బీటీ, సీసీ రోడ్లు నిర్మాణంతో అభివృద్ధిలో నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే *కూన రవికుమార్ బుడ్డివలస గ్రామంలో రూ.78 లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డు ప్రారంభం ఆమదాలవలస నియోజకవర్గంలోని సరుబుజ్జిలి మండలం చిన్న కాగితపల్లి పంచాయతీ పరిధిలోని బుడ్డివలస గ్రామంలో రూ.78 లక్షల వ్యయంతో, AIIB నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ఆమదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ శ్రీ *కూన రవికుమార్ ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే నాణ్యమైన రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ బీటీ రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజల ఎన్నో సంవత్సరాల కలను నెరవేర్చామని రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారుతాయని, విద్య, వైద్యం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ సంకల్పమని శ్రీ కూన రవికుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి ముఖ్య నాయకులు, ప్రభుత్వ అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
DNB News