DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలో నిర్మాణం పూర్తయిన మైనారిటీ బాలికల కాలేజీ ఇప్పటికీ ప్రారంభించకపోవడం పట్ల సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) ఆదోని నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా SDPI నాయకులు కాలేజీని సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అన్ని వసతులు సిద్ధంగా ఉన్నప్పటికీ కాలేజీని ప్రారంభించకుండా వాయిదా వేయడం వల్ల మైనారిటీ, ముఖ్యంగా ఉర్దూ విద్యార్థినుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని వారు అన్నారు. అలాగే, కాలేజీ ప్రారంభానికి అవసరమైన అన్ని బోధన సిబ్బంది (Teaching Staff)ను తక్షణమే నియమించాలని, కాలేజీ భద్రత కోసం కనీసం ఒక వాచ్మన్ను నియమించాలని ప్రభుత్వం వద్ద డిమాండ్ చేశారు. కాలేజీని వెంటనే ప్రారంభించకపోతే అనేకమంది విద్యార్థినుల విద్యా భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. కాలేజీ ప్రారంభం ఆలస్యం అవడం వల్ల విద్యార్థుల జీవితాలకు ఎటువంటి నష్టం జరిగినా, దానికి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి కాలేజీని ప్రారంభించాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోకపోతే, SDPI ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ధర్నా చేపడతామని నాయకులు హెచ్చరించారు. సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI) కో-కన్వీనర్: సద్దాం హుస్సేన్
Admin
DNB News