DNB News - ఆంధ్రప్రదేశ్ / : బహుజన్ సమాజ్ పార్టీ బాధితుల కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుంది బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మంచాల లక్ష్మీనారాయణ బహుజన బిడ్డ దళితల ఆత్మబంధువు రాజకీయంగా ఎదుగుతున్నటువంటి బందిమడుగుల రమేష్ పై దాడి చేసిన వారిని, మరణానికి కారకులైన వారిని చట్ట పరిధిలో కఠినంగా శిక్షించాలని బహుజన సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలలో దళిత బహుజనులపై రాజకీయంగా ఎదుగుతున్నటువంటి వారిని పసిగట్టి దాడులు చేయిస్తున్నారని కమ్మ కాపు రెడ్డి వెలమల కనసన్నుల్లో పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నదని తీవ్రంగా ఖండించారు. ఎల్లవేళలా బొందిమడుగుల రమేష్ కుటుంబానికి అండగా బహుజన సమాజ్ పార్టీ నిలుస్తుందని తెలియజేశారు. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం, ఆంధ్రలో కమ్మ, కాపు, బ్రాహ్మణ సామాజిక పార్టీలో కూటమిగా చేరి దళితులకు అందవలసినటువంటి ఎన్నో పథకాలను దూరం చేస్తూ చదువు విద్యలను నిర్లక్ష్యం చేస్తూ రాజకీయంగా బహుజనులకు అండగా నిలవడానికి ఎదుగుతున్నటువంటి ముఖ్య నాయకులపై దాడులు చేయడానికి కూడా బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తుందని ఎవరైతే రమేష్ మరణానికి కారకులైనరో వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Admin
DNB News