DNB News - ఆంధ్రప్రదేశ్ / : స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో ఈరోజు సాయంత్రం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళా చట్టాలు మరియు మహిళలపై జరుగుతున్న నేరాలపై అవగాహన సదస్సు విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలు, వాటి నివారణకు ఉన్న చట్టపరమైన రక్షణలు, అలాగే బాధితులు పొందగల సహాయం గురించి వివరంగా అవగాహన కల్పించారు. మహిళలు తమ హక్కులను తెలుసుకొని, ఎలాంటి అన్యాయానికి గురైనా ధైర్యంగా ముందుకు రావాలని అధికారులు సూచించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వాల్మీకి మాట్లాడుతూ, మహిళల భద్రతకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతి మహిళ తన హక్కులపై అవగాహన కలిగి ఉండటం సమాజ అభివృద్ధికి అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 3 టౌన్ సీఐ రామలింగయ్య , 1 టౌన్ సీఐ చంద్రశేఖర్ , తాలూకా సీఐ నల్లన్న , అడ్వకేట్ లలిత తదితరులు పాల్గొని మహిళలు ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, మరియు చట్టపరమైన సహాయం పొందే విధానాలపై వివరించారు. ఈ అవగాహన సదస్సు ద్వారా మహిళలకు తమ హక్కులపై స్పష్టమైన అవగాహన కలిగించి, నేరాలపై ధైర్యంగా స్పందించేలా ప్రేరణ కలిగినట్లు నిర్వాహకులు తెలిపారు.
Admin
DNB News