DNB News - ఆంధ్రప్రదేశ్ / : వైజాగ్ మెట్రో రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ పనితీరుపై పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అధ్యక్షతన సమావేశం వైజాగ్ మెట్రో రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ (VMRDA) పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నిధుల వినియోగం, నియామకాలు, ఆదాయ–వ్యయాల వివరాలు, మొత్తం పనితీరుపై సమగ్రంగా సమీక్షించేందుకు అసెంబ్లీ పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ (PUC) సమావేశాన్ని వైజాగ్ vmrda ఆఫీస్ లో నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు శ్రీ కూన రవికుమార్ అధ్యక్షత వహించారు. సమావేశంలో VMRDA ద్వారా అమలవుతున్న ప్రాజెక్టులు, ఆర్థిక వ్యవహారాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ????ఈ కార్యక్రమంలో పీయూసీ సభ్యులుగా పలాస శాసనసభ్యులు గౌతు శిరీష గారు, ఎచ్చెర్ల ఎమ్మెల్యే NER గారు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా వర్ల గారు పాల్గొన్నారు. అలాగే VMRDA ఉన్నతాధికారులు, అసెంబ్లీ పీయూసీ కమిటీ అధికారులు కూడా హాజరయ్యారు. ????ఈ సందర్భంగా కూన రవికుమార్ మాట్లాడుతూ, “ప్రజాధనాన్ని అత్యంత పారదర్శకంగా వినియోగించాలి. అభివృద్ధి పనులు నిర్ణీత కాలపరిమితిలో పూర్తయ్యేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలి. ఆదాయ వనరులు పెంచుతూ, వ్యయాల్లో నియంత్రణ పాటించాలి” అని స్పష్టం చేశారు. నియామకాల విషయంలో నిబంధనలు పాటిస్తున్నారా?, ఖాళీ పోస్టుల భర్తీ ఎలా జరుగుతోంది?, నిధుల కేటాయింపు మరియు ఖర్చుల మధ్య సమతుల్యత ఉందా? వంటి అంశాలపై సభ్యులు విస్తృతంగా చర్చించారు. ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచనలు చేశారు. VMRDA పనితీరును మరింత మెరుగుపరచేందుకు అవసరమైన మార్గదర్శకాలు, సూచనలను పీయూసీ కమిటీ అధికారులు vmrda అధికారులకు అందించారు. భవిష్యత్తులో ఎలాంటి లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశం ద్వారా VMRDAలో జవాబుదారీతనం పెరుగుతుందని, అభివృద్ధి పనులు మరింత వేగంగాతాయని సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Admin
DNB News