DNB News - ఆంధ్రప్రదేశ్ / : పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు SFI జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం నుంచి ప్రారంభమవుతున్న టెన్త్ పరీక్షలను ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా రాయాలని విద్యార్థులకు సూచించారు. మనసును స్థిరంగా ఉంచుకొని, పూర్తి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరైతే మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తులో ఈ పరీక్షలు ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయని పేర్కొన్న ఆయన, ప్రతి విద్యార్థి విజయం సాధించాలనే లక్ష్యంతో కష్టపడి పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు. అన్ని విద్యార్థులు మంచి మార్కులు సాధించి తమ కుటుంబానికి, పాఠశాలకు గర్వకారణంగా నిలవాలని శ్రీనివాసులు ఆకాంక్షిస్తూ వారికి ఆల్ ది బెస్ట్ తెలిపారు.
Admin
DNB News