DNB News - ఆంధ్రప్రదేశ్ / : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఆదోని పరిధిలో పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదోని రూరల్ సీఐ నల్లప్ప ఆధ్వర్యంలో ఈ చర్యలు అమలు చేయబడుతున్నాయి. ఈ క్రమంలో ఈస్వీ పోలీస్ స్టేషన్ ఎస్సై మహేష్ కుమార్ మరియు సిబ్బంది కలిసి ఆదోని–ఆలూరు, సిరిగుప్ప రహదారులపై వాహనాల వేగ నియంత్రణ కోసం మొత్తం 12 స్పీడ్ స్టాపర్లను ఏర్పాటు చేశారు. ధనపురం, నారాయణపురం, సంతకుళ్లూరు గ్రామాల సమీప రహదారుల వద్ద ఈ స్పీడ్ స్టాపర్లు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామాల వద్ద వాహనాల వేగం తగ్గి రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గే అవకాశముందని ఎస్సై మహేష్ కుమార్ తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ రోడ్డు భద్రతకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Admin
DNB News