DNB News - ఆంధ్రప్రదేశ్ / : - ఎర్రచందనం స్మగ్లర్కు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3,00,000/- జరిమానా. - ‘గుడ్ ట్రయల్ మానిటరింగ్’ ద్వారా న్యాయ విజయం సాధించిన జిల్లా పోలీసులు. - 2016 కేసులో కోర్టు కీలక తీర్పు. - అడవుల సంపద రక్షణలో కట్టుదిట్టమైన చర్యలు. - తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి పర్యవేక్షణలో అమలు చేస్తున్న ‘గుడ్ ట్రయల్ మానిటరింగ్’ వ్యవస్థ ఫలితంగా ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. - 2016లో ఎర్రవారి పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో విచారణ పూర్తిచేసి, తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడిజె కోర్టు గౌరవ న్యాయమూర్తి శ్రీ ఏ. నరసింహమూర్తి గారు తీర్పు వెలువరించారు. - నిందితుడు: - A1) వాయలపాటి హరినాధ రెడ్డి, 54 సంవత్సరాలు, తండ్రి బయ్యరెడ్డి, కె. తొప్పిరెడ్డి గారి పల్లి గ్రామము, ఉదయ మాణిక్యం (హెచ్/ఓ), ఎర్రవారి పాలెం మండలం, తిరుపతి జిల్లా. - పై నిందితుడికి 5 సంవత్సరాల కారాగార శిక్షతో పాటు రూ.3,00,000/- జరిమానా విధించగా, జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 6 నెలల జైలు శిక్ష విధించబడింది. - ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారు మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణా వంటి నేరాలపై తిరుపతి జిల్లా పోలీసులు జీరో టోలరెన్స్ విధానాన్ని అమలు చేస్తున్నారు. గుడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా ప్రతి కేసును నిశితంగా పర్యవేక్షించి, నిందితులు శిక్షకు గురయ్యేలా పటిష్ట సాక్ష్యాలను కోర్టులో సమర్పిస్తున్నాము. ఈ తీర్పు ఎర్రచందనం స్మగ్లర్లకు గట్టి హెచ్చరిక. చట్టాన్ని అతిక్రమించే ఎవరినీ విడిచిపెట్టము, అడవులు, సహజ వనరులు ప్రభుత్వానికి మాత్రమే కాకుండా ప్రజల సొత్తు. వాటిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత, సాంకేతిక ఆధారిత నిఘా, అంతర్రాష్ట్ర సమన్వయం ద్వారా స్మగ్లింగ్ నెట్వర్క్లను పూర్తిగా నిర్మూలిస్థాము తెలిపారు.
Admin
DNB News