DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని సీమ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో తన సత్తాను చాటింది. ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసి న్యూట్రిషియన్గా సేవలందిస్తున్న ఆమె, తొమ్మిదేళ్లుగా మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటూ విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని డిస్కస్ త్రో, రేస్ వాక్, షాట్పుట్ విభాగాల్లో పతకాలు సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆమె ప్రతిభను చాటారు. 2020లో ఫిన్లాండ్లో, 2023లో ఫిలిప్పీన్స్లో జరిగిన పోటీల్లో రేస్ వాక్ విభాగంలో ఐదో స్థానంలో నిలిచారు. తాజాగా కేరళ రాష్ట్రంలో నిర్వహించిన మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో 45 ప్లస్ మహిళా విభాగంలో వెండి పతకం సాధించి ఆదోని ప్రాంతానికి గర్వకారణంగా నిలిచారు. ఇప్పటి వరకు సుమారు 40 పతకాలు సాధించిన ఆమె, నిత్యం ఉదయం గంటన్నర నడక, వ్యాయామం, సాయంత్రం గంట పాటు జిమ్ చేస్తూ కఠిన సాధన కొనసాగిస్తున్నారు. మరోవైపు పలువురితో బృందంగా శిక్షణ ఇస్తూ క్రీడలపై అవగాహన కల్పిస్తున్నారు. ఎప్పటికైనా అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పతకం సాధించడమే తన అంతిమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
Admin
DNB News