Wednesday, 17 June 2026 02:54:24 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

కూటమి నేతలు సమన్వయంతో పనిచేయకపోతే ఫ్యాక్షన్ ప్రభావం పెరిగే ప్రమాదం-- నూర్ అహ్మద్..

Date : 15 May 2026 11:49 AM Views : 45

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని నియోజకవర్గంలో గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న తగాదాలు, దాడుల ఘటనలపై మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి , కూటమి నాయకులు పరిపాలన మరియు పార్టీ కార్యకర్తలపై సమగ్ర పట్టు సాధించి సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఆదోని నియోజకవర్గం ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముఖ్యంగా వైసీపీ నుంచి బీజేపీలో చేరుతున్న కొందరు నాయకులు, పార్థసారధి విజయానికి కృషి చేసిన టీడీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి కూటమి పార్టీలతో కలిసి ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి గ్రామాల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అలాగే పార్టీలో చేరే వ్యక్తులకు ముందుగా కూటమి పార్టీలతో సమన్వయం, శాంతియుత రాజకీయాలపై కౌన్సెలింగ్ ఇవ్వాలని కోరారు. ఆదోనిలో పెరుగుతున్న దాడుల సంస్కృతి గురించి రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు దాడులు, ప్రతిదాడులకు దూరంగా ఉండి శాంతియుత జీవనం సాగించాలని విజ్ఞప్తి చేశారు. భద్రతా సమస్యలు ఎదురైతే పోలీసులకు, ఉన్నతాధికారులకు, మీడియాకు ఫిర్యాదు చేసి చట్టబద్ధంగా న్యాయం పొందాలని సూచించారు. ప్రజాసంఘాల నాయకులుగా తాము కూడా ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దాడులు, ప్రతిదాడుల వల్ల కుటుంబాల భవిష్యత్తు అంధకారమవుతుందని, ప్రజలు రాజ్యాంగబద్ధంగా తమ హక్కులను సాధించుకోవాలని నూర్ అహ్మద్ పిలుపునిచ్చారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: