DNB News - ఆంధ్రప్రదేశ్ / : తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని చిడిపిగ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేత ప్రత్తిపాటి నాగరాజు తండ్రి ప్రత్తిపాటి రాంబాబు హఠాన్మరణం చెందారు.ఆయన జ్ఞాపకార్ధముగ 200 మంది పేదవారికి అన్నదాన కార్యక్రమం. నిర్వహించారు, కొవ్వూరు గోష్పాద క్షేత్రం దగ్గర, రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్న యాచకులకు, పేదవారికి భోజనాలు అందించడం జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమాలు మా తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించేవారు,దేవుడే నీ ధ్వారా పేదలకు సహాయం చేపిస్తున్నారని తల్లి దండ్రులు ఎప్పుడు చెప్పేవారని, మేము చేసే సేవా కార్యక్రమాలను చూసి వారు ఎంతో ఆనంద పడేవారని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు,ఈ కార్యక్రమం లో దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.
Admin
DNB News