DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మిగనూరు పట్టణంలోని హెచ్బీఎస్ కాలనీలో గల పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనాధ ఆశ్రమంలో అక్బర్ సాహెబ్ 19వ వర్ధంతి సందర్భంగా 30 మంది అనాధ పిల్లలకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బైలుప్పల అక్బర్ సాహెబ్ కుమారులు డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా, బైలుప్పల మహబూబ్ బాషా ఆధ్వర్యంలో మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ బాధ్యులు ఎం. ఖాసిం వలి, సమాజ సేవకులు డాక్టర్ కామలే గణేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని అనాధ పిల్లలతో కలిసి భోజనం వడ్డించి సేవాభావాన్ని చాటారు. అక్బర్ సాహెబ్ వర్ధంతి సందర్భంగా తమ ఆశ్రమంలో అన్నదానం నిర్వహించిన బైలుప్పల కుటుంబ సభ్యులకు పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు ఎం. నరసన్న, ఎం. ఖాసిం వలి, డాక్టర్ కామలే గణేష్ హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా, బైలుప్పల మహబూబ్ బాషా మాట్లాడుతూ అనాధ పిల్లలకు అవసరమైన సేవలు, విద్యా–వైద్య సహాయాలు తమ తరఫున నిరంతరం అందజేస్తామని హామీ ఇచ్చారు.
Admin
DNB News