Saturday, 18 April 2026 06:03:16 PM
# మంగ్లీపై ఆరోపణల్ని ఖండిస్తున్నాం..అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు భూక్యా హరినాయక్ # విజయవాడలో బిజెపి కీలక సమావేశం – రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం.. # పోచమ్మ చెరువులో పూడికతీత పనులకు భూమి పూజ – స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై కలెక్టర్ డా.ఏ.సిరి అవగాహన # స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పోలీసుల స్వచ్ఛత కార్యక్రమాలు... # శాతవాహనలో ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు # విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కరీంనగర్ # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలంపియాడ్ లో పతకాలు # రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు

ఆదోనిలోని ఈఎస్ఐ హాస్పిటల్‌ను కర్నూలుకు తరలించవద్దు – కార్మిక సంఘాల డిమాండ్.

Date : 17 March 2026 03:39 PM Views : 29

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోనిలో గత 50 సంవత్సరాలుగా కార్మికులకు వైద్య సేవలు అందిస్తున్న ఈఎస్ఐ హాస్పిటల్‌ను కర్నూలుకు తరలించే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని కార్మిక సంఘాలు మరియు ఈఎస్ఐ లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈఎస్ఐ లబ్ధిదారుల ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు పి.ఎస్. గోపాల్, తిప్పన్న, ఈరన్న మరియు ఈఎస్ఐ లబ్ధిదారులు మాట్లాడుతూ, ప్రస్తుతం ఈఎస్ఐ ఆసుపత్రిని ఈస్ట్, వెస్ట్‌గా విభజించి వైద్యం అందిస్తున్నప్పటికీ తగిన సదుపాయాలు లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆసుపత్రిలో డాక్టర్ల కొరత, ఈసీజీ వంటి పరీక్షల సౌకర్యం లేకపోవడం, అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడం వల్ల ఈఎస్ఐ లబ్ధిదారులకు సరైన వైద్యం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదోనిలో సుమారు 3000 మంది ఈఎస్ఐ చందాదారుల కుటుంబాలు ఉన్నాయని, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ ప్రాంతాల కార్మికులు కూడా ఈ ఆసుపత్రిపై ఆధారపడుతున్నారని పేర్కొన్నారు. మెరుగైన వైద్యం ఆశించి వచ్చే కార్మికులు సరైన సదుపాయాలు లేక నిరాశతో తిరిగి వెళ్తున్న పరిస్థితి ఉందన్నారు. అందువల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి ఆసుపత్రిలో వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని, డాక్టర్లు మరియు అవసరమైన సదుపాయాలను కల్పించాలని, అలాగే ఈఎస్ఐ హాస్పిటల్‌ను కర్నూలుకు తరలించే నిర్ణయాన్ని నిలిపివేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో దేవేంద్ర, తిక్కప్ప, శంకర్, మధు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :