Saturday, 18 April 2026 02:04:20 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

విజయవాడలో పెను ప్రమాదం తప్పింది.

Date : 08 March 2026 01:06 PM Views : 52

DNB News - ఆంధ్రప్రదేశ్ / : పోలీసులపైనే ఓ యువకుడు పిస్టల్‌తో కాల్పులకు తెగబడటం నగరంలో కలకలం రేపింది. ఆ వివరాల్లోకి వెళ్తే... పోలీసులపై కాల్పుల యత్నం: విజయవాడలో ఉద్రిక్తత విజయవాడలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న పోలీసులపై ఓ యువకుడు తుపాకీతో దాడికి ప్రయత్నించాడు. శనివారం తెల్లవారుజామున 'ఆపరేషన్ వజ్రప్రహార్'లో భాగంగా కృష్ణలంకలోని షిరిడీ బాలాజీ లాడ్జిలో తనిఖీలు చేపట్టగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఏం జరిగిందంటే? మహబూబాబాద్ జిల్లాకు చెందిన కనకం మురళీ పటేల్ అనే యువకుడు హైదరాబాద్‌లో సినీ రంగంలో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితం బీహార్‌లో కొనుగోలు చేసిన 7ఎంఎం పిస్టల్‌తో ఇతడు విజయవాడకు వచ్చాడు. లాడ్జి గదిలోకి తనిఖీలకు వచ్చిన హెడ్ కానిస్టేబుల్ విజయ సారధి నాయక్‌పై మురళీ ఒక్కసారిగా పిస్టల్ ఎక్కుపెట్టాడు. అయితే ట్రిగ్గర్ లాక్ అవ్వడంతో అది పేలలేదు. సినిమా ఫక్కీలో ఛేజింగ్.. పోలీసును నెట్టేసి గది నుంచి పారిపోయిన నిందితుడు.. రాజీవ్ గాంధీ పార్క్ సమీపంలో మరో రెండుసార్లు పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. చివరకు పోలీసులు వెంబడించి, బస్టాండ్ ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్ వద్ద నిందితుడిని రాయిని విసిరి కొట్టి పట్టుకున్నారు. గ్రామ కక్షలే కారణమా? నిందితుడి వద్ద నుంచి పిస్టల్‌తో పాటు ఐదు బుల్లెట్లు, పెప్పర్ స్ప్రే, ఎలక్ట్రికల్ షాకింగ్ గన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన సొంత గ్రామంలో శత్రువులు ఉన్నారని, వారి నుంచి రక్షణ కోసమే తుపాకీ కొన్నట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :