DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా... పోలీసు శాఖలోని ఎఎస్సైలు / హెడ్ కానిస్టేబుల్స్కు సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) పదోన్నతుల కోసం నిర్వహిస్తున్న ఎంపిక పరీక్షలను కర్నూలు జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో మంగళవారం నిర్వహించారు. ఈ పరీక్షల నిర్వహణ తీరును ఎపిఎస్పీ రెండవ బెటాలియన్ కమాండెంట్ శ్రీమతి దీపికా పాటిల్ ఐపీఎస్ పరిశీలించారు. కర్నూలు రేంజ్ డిఐజి శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పర్యవేక్షణలో ఈ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. రాయలసీమ జోన్ పరిధిలోని మొత్తం 72 మంది ఎఎస్సైలు / హెడ్ కానిస్టేబుల్స్ ఈ ఎస్సై పదోన్నతి పరీక్షలకు హాజరయ్యారు. ఇండోర్ పరీక్షలు: పేపర్-1లో ఐపీసీ (భారతీయ శిక్షాస్మృతి), సి.ఆర్.పి.సి (నేరప్రక్రియ కోడ్), భారతీయ సాక్ష్యాధారాల చట్టం, ప్రత్యేక స్థానిక చట్టాలపై పరీక్షలు నిర్వహించారు. పేపర్-2లో పోలీసు విధానం, విచారణ న్యాయం, వైద్య అంశాలు, నేర వైజ్ఞానిక శాస్త్రం, వేలిముద్రలు, పాదముద్రలు, శాస్త్రీయ సహాయం, నేరాల నిరోధం మరియు గుర్తింపు తదితర అంశాలపై పరీక్షలు జరిగాయి. ఔట్డోర్ పరీక్షలు: ఏప్రిల్ 8న నిర్వహించనున్న ఔట్డోర్ పరీక్షల్లో డ్రిల్లు, ఆయుధాలపై పరిజ్ఞానం, నేరస్థల పరిశీలన, మౌఖిక పరీక్ష (ఓరల్ టెస్ట్) తదితర అంశాలపై పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు డిటిసి ప్రిన్సిపాల్ శ్రీ హుస్సేన్ పీరా గారు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీ దుర్గాప్రసాద్ పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు సబ్ ఇన్స్పెక్టర్ హోదాకు పదోన్నతులు కల్పించబడతాయి. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ / డిటిసి ప్రిన్సిపాల్ హుస్సేన్ పీరా, డిఎస్పీ / వైస్ ప్రిన్సిపాల్ దుర్గప్రసాద్, డిఎస్పీలు శ్రీనివాసులు, బాల స్వామి రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, పోలీసు వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ స్రవంతి, నన్నూరు పిహెచ్సి డాక్టర్ నందిని, డిఐజి కార్యాలయ మేనేజర్ రత్నప్రకాశ్, సిఐలు, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Admin
DNB News