DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు జిల్లా కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" PGRS కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. భూమి వివాదాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహ సమస్యలు, ఇతర పరిపాలనా అంశాలకు సంబంధించిన వినతులను అధికారులు నమోదు చేశారు. జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రతి వినతిని ప్రాధాన్యతతో పరిశీలించి, నిర్దిష్ట గడువులో పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Admin
DNB News