DNB News - ఆంధ్రప్రదేశ్ / : శనివారం ఉదయం కర్నూలు బస్టాండ్ సమీపంలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక నమాజ్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో పాటించిన క్రమశిక్షణ, సోదరభావం, పేదలకు సహాయం చేసే సద్గుణాలను జీవితంలో ఎల్లప్పుడూ కొనసాగించాలని సూచించారు. మహమ్మద్ ప్రవక్త బోధనలే మనకు సరైన మార్గదర్శకమని పేర్కొన్నారు. అలాగే ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
Admin
DNB News