Friday, 19 June 2026 02:05:43 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు..

Date : 08 April 2026 09:38 AM Views : 77

DNB News - ఆంధ్రప్రదేశ్ / : అప్రమత్తతతో బాలిక భవిష్యత్తు కాపాడిన ఐసిడిఎస్ బృందం ఆదోని మండలం సుల్తాన్‌పురం గ్రామంలో జరగబోతున్న ఒక బాల్య వివాహాన్ని ఐసిడిఎస్ అధికారులు సమయోచితంగా అడ్డుకుని బాలిక భవిష్యత్తును కాపాడారు. అందిన గోప్య సమాచారం మేరకు వెంటనే స్పందించిన ఐసిడిఎస్ అధికారులు, సీడీపీఓ దిల్లేశ్వరి ఆదేశాల మేరకు సూపర్వైజర్ సావిత్రి సంఘటన స్థలానికి చేరుకున్నారు. బోయ కమలాక్షి-హనుమన్న దంపతుల కుమారుడు నాగేంద్ర (22) మరియు మంగంపేట గ్రామానికి చెందిన పెద్ద కాత్రిక నాగలక్ష్మి-అనుమప్ప దంపతుల కుమార్తె (16) మధ్య వివాహం బుధవారం సాయంత్రం 5:30 గంటలకు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరగాల్సి ఉండేది. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ సావిత్రి బాలిక కుటుంబ సభ్యులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ, బాల్య వివాహం చట్ట విరుద్ధమని వివరించారు. భారతదేశంలో అమలులో ఉన్న "ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్-2006" ప్రకారం, 18 సంవత్సరాల లోపు అమ్మాయికి, 21 సంవత్సరాల లోపు అబ్బాయికి వివాహం జరపడం నేరమని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో కుటుంబ సభ్యులు వివాహాన్ని నిలిపివేశారు. అధికారులు బాలిక భవిష్యత్తు, విద్యపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామ ప్రజలు కూడా బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు తెలిసిన వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధికారులు, వీఆర్వో, పోలీసులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. సమాజం సహకరిస్తేనే బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించగలమని అధికారులు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: