DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్ర ప్రభుత్వం మద్యం నిభందనలు ప్రకారం విక్రయం చేయాలని పదేపదే హెచ్చరికలు చేస్తున్న దుకాణదారులు మాత్రం ఆ షరతులు మాకు వర్తించవు అనే ధోరణిలో రాత్రి పగలు తేడా లేకుండా విక్రయాలు జోరుగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో నాయుడుపేట మున్సిపల్ పరిధిలో ఉన్న జువ్వలపాలెం గ్రామానికి చెందిన ఒక రిక్షా కార్మికుడు తెల్లవారుజామున నుంచే మద్యం సేవించి ఆ మత్తులో నాయుడుపేట, శ్రీకాళహస్తి 71వ జాతీయ రహదారి నడ్డి రోడ్డు పై తన ఇల్లు లాగా దర్జాగా నిద్రపోయాడు. అది రౌండ్ సర్కిల్ కావడం తో పాటు టర్నింగ్ పాయింట్ కావడంతో చెన్నై, బెంగళూరు, నెల్లూరు తిరుపతి వైపు వెళ్లే మార్గం కావడం తో నిత్యం వందల వాహనాలు రాకపోకలు వెళ్ళుతుంటయి. రోడ్డు మధ్య లో నిద్రపోతున్న విషయం దగ్గరకు వచ్చే వరకు భారీ వాహనాలు, బస్సు డ్రైవర్లు ఆలస్యంగా గమనించి సడన్ బ్రేక్ వేయడం తో అనేక తృటిలో తప్పి పోయినయి. దీనితో గంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎవరు కూడా మందుబాబు ను పక్కకు లాగక పోవడంతో ఆయన దర్జాగా నిద్రపోయాడు. అక్కడే ఉన్న మద్యం దుకాణదారులు గమనించి వెంటనే ఆ మందుబాబు ను నీళ్లు చల్లి రోడ్డు మార్జిన్ పక్కు లాగివేయడంతో పాటు అక్కడే దూరంగా ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోం గార్డు ఆఘమేఘాల పై వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఏది ఏమైనా అటు మందుబాబు ప్రాణాలు తో పాటు వాహనాలు కు ప్రమాదం తప్పింది స్థానికులు ఊపిరి పీల్చుకొన్నారు.
Admin
DNB News