DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాష్ట్ర సచివాలయం నుండి పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ప్రక్రియ, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పి. రంజిత్ బాషా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కర్నూలు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పాల్గొన్నారు. సమావేశంలో పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంపు, డ్రాప్అవుట్ల నివారణ, ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతుల బలోపేతం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. అలాగే ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్, భద్రత, వైద్య సదుపాయాలు వంటి ఏర్పాట్లపై అధికారులకు సూచనలు ఇచ్చారు. జిల్లా స్థాయిలో అన్ని శాఖల సమన్వయంతో పరీక్షల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Admin
DNB News